వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరోసారికుప్పకూలిన భారత్‌ టాప్‌ ఆర్డర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నాగపూర్‌:భారత్‌ టాప్‌ ఆర్డర్‌ది మరోసారి అదే దారి.మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుధవారంభారత్‌ టాప్‌ ఆర్డర్‌ ఆస్ట్రేలియా బౌలర్లచేతిలో చిత్తయింది. భారత బ్యాట్స్‌మెన్‌ఒక్కరొక్కరే పెవిలియన్‌ దారి పట్టారు. ఎంతోఆశలు పెట్టుకున్న సచిన్‌ టెండూల్కర్‌ కూడానిరాశ పరిచాడు. అతను ఎనిమిదిపరుగులకే చేతులెత్తేశాడు.

ఆస్ట్రేలియాతన తొలి ఇన్నింగ్స్‌లో మూడు వందలతొంబై ఎనిమిది పరుగులకు ఆల్‌ అవుట్‌అయింది. జహీర్‌ ఖాన్‌ నాలుగు వికెట్లుపడగొట్టాడు. క్లార్క్‌ సెంచరీకి చేరువలోతొంబై ఒక్క పరుగులు చేసి జహీర్‌బౌలింగ్‌లో అవుట్‌ కావడంతో ఆస్ట్రేలియా తొలిఇన్నింగ్స్‌ ముగిసింది. ఆ తర్వాతబ్యాటింగ్‌కు దిగిన భారత్‌ బ్యాట్స్‌మెన్‌ఏ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు.తొంబై ఐదు పరుగులకే భారత్‌నాలుగు ప్రధాన వికెట్లనుకోల్పోయింది.జిలెస్పిమొదటి ఓవర్‌లో సెహ్వాగ్‌ నాలుగుబౌండరీలు కొట్టి ఆశలు రేకెత్తించాడు.ఇరవై బంతుల్లో ఇరవై రెండుపరుగులు చేసిన సెహ్వాగ్‌ మెక్‌గ్రాత్‌బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ గిల్‌క్రిస్ట్‌కుక్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. అనంతరంజిలెస్పి బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ ఆకాశ్‌చోప్రా భారత్‌ స్కోర్‌ ముప్పై నాలుగుపరుగులు ఉన్నప్పుడు అవుటయ్యాడు.వివియస్‌ లక్ష్మణ్‌, ద్రావిడ్‌ మరోసారివిఫలమయ్యారు. లక్ష్మణ్‌ పదమూడుపరుగులకు, ద్రావిడ్‌ ఇరవై ఒక్కపరుగులకు అవుటయ్యారు. బుధవారం ఆటముగిసే సమయానికి కైఫ్‌ నలబైఏడు పరుగులతో, పార్థివ్‌ పటేల్‌పదహారు పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి నూటా నలబైఆరు పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్లు మెక్‌గ్రాత్‌, జిలెస్పీ చెరోరెండు వికెట్లు తీసుకున్నారు. స్పిన్నర్‌షేన్‌ వార్న్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఫాలోఆన్‌ తప్పించుకోవడానికి భారత్‌ ఎంతోశ్రమించాల్సి ఉంటుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X