వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడో టెస్టు:కంగారెత్తిన భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

నాగపూర్‌:ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్‌లో భారతక్రికెటర్లను కంగారెత్తిస్తోంది.బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో ఆస్ట్రేలియా భారత్‌పైఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 185పరుగులకే భారత్‌ను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. మొహ్మద్‌ కైఫ్‌ ఒక్కడే అర్థసెంచరీ సాధించాడు. కైఫ్‌ గురువారంయాబై ఐదు పరుగుల వద్దఅవుటయ్యాడు. మిగతా భారతబ్యాట్స్‌మెన్‌ ఎవరు కూడా 22పరుగులను దాటిచేయలేకపోయారు.

ఆస్ట్రేలియాఫాస్ట్‌ బౌలర్లు జిలెస్పీ, మెక్‌గ్రాత్‌భారత బ్యాటింగ్‌ను తుత్తునియలుచేశారు. జిలెస్పీ ఐదు వికెట్లు తీసుకోగామెక్‌గ్రాత్‌కు మూడు వికెట్లు లభించాయి.అయితే భారత్‌కు ఫాలో ఆన్‌ ఇవ్వకుండాఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేయడంలో భారత బౌలర్లు మరోసారివిఫలమయ్యారు.గురువారంఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడువికెట్లు మాత్రమే కోల్పోయి 202పరుగులు చేసింది. దీంతో భారత్‌మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుపై ఆస్ట్రేలియా 415పరుగుల ఆధిక్యతను సాధించింది.తద్వారా మూడో టెస్టుపై ఆస్ట్రేలియా పట్టుబిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీచేసిన మార్టిన్‌ 41పరుగులతో, క్లార్క్‌ పది పరుగులతోక్రీజ్‌లో ఉన్నారు. కటీచ్‌ ఒక్కపరుగుతో సెంచరీ మిస్‌ అయ్యాడు. కటీచ్‌99పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్దమురళీకార్తిక్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.జహీర్‌ఖాన్‌కు ఒక వికెట్‌ లభించగా,మురళీ కార్తిక్‌కు రెండు వికెట్లులభించాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X