వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌భూఆక్రమణలపై వైయస్‌ మండిపాటు

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు:సిపిఐ (మావోయిస్టు) నక్సలైట్ల భూఆక్రమణలపై ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తీవ్రంగామండిపడ్డారు. మావోయిస్టుల మాదిరిగాఇతరులు కూడా తుపాకులు పట్టుకొని తిరిగితేరాష్ట్రంలో ఆరాచకమేనని ఆయనఅన్నారు. ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లోఆయన రాజీవ్‌ పల్లెబాట కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపలు బహిరంగ సభల్లోప్రసంగించారు.

ప్రతిఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని, రాజ్యాంగానికికట్టుబడి వ్యవహరించాలని ఆయన అన్నారు.భూమి పంపకంలో తాము చట్టప్రకారంముందుకు సాగుతున్నామని, పూర్తిస్థాయిలో భూమి పంపణీ చేపట్టడానికిరెవెన్యూ రికార్డులను పరిశీలించాల్సివున్నదని ఆయన చెప్పారు. తుపాకులుపట్టుకుని తిరిగితే ప్రభుత్వం ఎందుకు,పరిపాలనా యంత్రాంగం ఎందుకు అనిఆయన అడిగారు. చట్టవ్యతిరేకంగావ్యవహరించకూడదని ఎస్‌. ఆర్‌.శంకరన్‌, ఇతర మధ్యవర్తులునక్సల్స్‌ సూచించారని, వారి సూచనకునక్సల్స్‌ కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.చట్టానికి తాము అతీతులమంటేప్రజాస్వామ్యంలో వీలు కాదని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X