వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడో టెస్టు:భారత్‌ చారిత్రాత్మక అపజయం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:చర్చల ఫలితం ప్రభుత్వంపైనేఆధారపడి ఉన్నదని సిపిఐ (మావోయిస్టు)ప్రతినిధి సుధాకర్‌ అన్నారు. ఒక అటవీప్రాంతంలో ఆయన విలేకరులతోమాట్లాడారు. అత్యంత ప్రధానమైనభూమి సమస్యను ప్రభుత్వం ఎందుకునిర్లక్ష్యం చేస్తున్నదో అర్థంకావడం లేదని ఆయన అన్నారు. తమవైపు నుంచి తొలి దశ చర్చలుఫలవంతమైనట్లేనని భావిస్తున్నామనిఆయన చెప్పారు.

తాములేవనెత్తిన అంశాలపై ప్రభుత్వస్పందన ఎలా ఉంటుందో చూడాల్సినఅవసరం ఉన్నదని ఆయన అన్నారు. ప్రజలసమస్యలను చట్టబద్దంగా ప్రభుత్వంముందు పెట్టడానికి, ప్రజలకు తాముదగ్గరగా వున్నామని చెప్పడానికిచర్చలకు వచ్చామని, ఈ రకంగా తాముచర్చల విషయంలో విజయంసాధించినట్లేనని ఆయన అన్నారు.సమస్యలు అవే అయినా, హైదరాబాద్‌వచ్చిన తర్వాత వాటి విస్తృతిఅర్థమైందని ఆయన అన్నారు.తొలివిడత చర్చల్లో రెండు సమస్యలనేలేవనెత్తామని, ప్రజాస్వామ్య హక్కులసమస్యను ప్రస్తావించామని, అయితే ఇంకావిస్తృతంగా చర్చ జరగాల్సివున్నదని, బూటకపు ఎన్‌కౌంటర్ల గురించిమాట్లాడాల్సి ఉన్నదని ఆయన అన్నారు. అలాగేభూమి సమస్యపై ప్రశ్నించామే తప్ప ఇంకావిస్తృతంగా చర్చించాల్సి ఉన్నదని ఆయనఅన్నారు. తమ వద్ద కొన్ని పథకాలుఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చినహామీలను ప్రభుత్వం అమలు చేస్తుందా,లేదా చూడాల్సి వున్నదని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X