ముఖ్యమంత్రికిమొరపెట్టుకున్న సినీప్రముఖులు
హైదరాబాద్:సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్నవీడియో పైరసీని అరికట్టాలని తెలుగు సినిమాప్రముఖులు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డినికలుసుకుని వినతి పత్రం సమర్పించారు.మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు మోహన్ బాబునాయకత్వంలో సినిమాపరిశ్రమకు చెందిన ప్రముఖులుశుక్రవారం ఉదయం సోమాజీగుడా నుంచిలేక్ వ్యూ అతిధి గృహం వరకుఊరేగింపుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలుసుకునిసినిమా పరిశ్రమఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
పదిడిమాండ్లతో వినతి పత్రం సమర్పించారు.ముఖ్యమంత్రి తమ డిమాండ్ల పట్లసానుకూలంగాప్రతిస్పదించారని, నవంబర్ ఆరో తేదీనజరుగనున్న నంది అవార్డుల బహూకరణ కార్యక్రమంలోసినిమారంగానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలనుప్రకటిస్తానని హామీ ఇచ్చారని మోహన్బాబువిలేకరులకు చెప్పారు. మోహన్బాబు వెంటశ్రీకాంత్,శివాజీరాజా,అంబికాకృష్ణ, ఆదిశేషగిరి రావుముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేష్,నాగార్జున కూడా ముఖ్యమంత్రినికలిసినవారిలో ఉన్నారు