బిజెపి జాతీయకార్యదర్శిగా బండారు దత్తాత్రేయ
న్యూఢిల్లీ:భారతీయజనతాపార్టీ నూతన అధ్యక్షుడు ఎల్కెఅద్వానీ శనివారం పార్టీ నూతనకార్యవర్గాన్ని ప్రకటించారు. తనకుఇష్టుడైన బండారు దత్తాత్రేయను అద్వానీ బిజెపిజాతీయ కార్యదర్శిగా నియమించారు. మధ్యప్రదేశ్మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతిని ప్రధానకార్యదర్శిగా నియమిస్తారన్న ఊహాగాలకుభిన్నంగా ఆమెకు ఆ పదవి లభించలేదు.ఆమెను జాతీయ కార్యవర్గంలోసభ్యురాలిగా నియమించారు.
హర్యానాఎంపి కిషన్ సింగ్ సంఘ్వాన్ను పార్టీఉపాధ్యక్షుడిగా నియమించారు. త్వరలోహర్యానా అసెంబ్లీ ఎన్నికలుజరుగనున్నందున కిషన్ సింగ్కుప్రాధాన్యం లభించింది. పార్టీ ఉపాధ్యక్షులుగాఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికళ్యాణ్సింగ్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రిబాబూలాల్ మరాండి కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్కుచెందిన హరిబాబుకు జాతీయకార్యవర్గంలో స్ధానం లభించింది. పార్టీలోకొత్తగా చేరిన వరుణ్గాంధీ, నజ్మాహెఫ్తుల్లాలకు కూడా కార్యవర్గంలో చోటుకల్పించారు.