పార్ధీవ్,చోప్రా,యువ్రాజ్,అగార్కర్ ఔట్
నాగపూర్:ముంబాయిలో ఆ్రస్టేలియాతో జరుగనున్న నాలుగో టెస్టులో ఆడనున్న జట్టులోభారీ మార్పులు చేశారు. పార్ధీవ్ పటేల్,ఆకాశ్ చోప్రా,యువరాజ్ సింగ్,అజిత్అగార్కర్లపై వేటు పడింది. యువఆటగాళ్ళు గౌతం గంభీర్, ధీరజ్జాదవ్, శివ్ శంకర్ పాల్, వికెట్కీపర్ దినేష్ కార్తీక్లకు అవకాశంకల్పిస్తున్నట్టు క్రికెట్ బోర్డు కార్యదర్శిఎస్కె నాయర్ శనివారం మధ్యాహ్నంప్రకటించారు. గాయాలనుంచి కోలుకోనిఇర్ఫాన్ పటేల్ను నాలుగో టెస్టుకు దూరంగా ఉంచారు. ఎల్లుండిలోపు కెప్టెన్గంగూలీ ఫిట్నెస్ టెస్ట్లో పాసయితేనేఆయన ఆడే అవకాశం కల్పిస్తారు.
కొత్తజట్టు:వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్,రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండుల్కర్, దినేష్ కార్తీక్, మహ్మద్ కైఫ్, అనిల్కుంబ్లే, హర్బజన్ సింగ్, మురళీకార్తీక్, జహీర్ఖాన్, ఆశిష్ నెహ్రా, ఎస్ఎస్ పాల్, వివిఎస్ లక్ష్మణ్,ధీరజ్ జాదవ్.