వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులిచింతలవల్ల అన్యాయం అబద్ధం: నేదురుమల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కృష్ణా నదిపై నిర్మిస్తున్న పులిచింతలప్రాజెక్టు వల్ల ఏ ప్రాంతానికీ అన్యాయంజరగదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌లోక్‌సభ సభ్యుడు నేదురుమల్లిజనార్దన్‌ రెడ్డి అన్నారు. పులిచింతలప్రాజెక్టుపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సిడబ్ల్యుసి) సభ్యుడు జి. వెంకటస్వామిచేసిన విమర్శలను ఆయన ఆదివారంవిలేకరుల సమావేశంలోఖండించారు.

పులిచింతలపైవెంకటస్వామి బహిరంగ విమర్శలుచేయడానికి బదులు తన మనోభావాలనుసోనియా గాంధీకి చెప్పుకుంటేబాగుండేదని ఆయన అన్నారు. తానుతెలంగాణకు అన్యాయం చేశాననిఎవరైనా చెప్పగలరా? అని ఆయనఅడిగారు. తాము ప్రాంతాలను వేరు చేసిచూడలేదని ఆయన స్పష్టం చేశారు.తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడుమారుమూల ప్రాంతాల అభివృద్ధికి వందకోట్ల రూపాయలు తెచ్చి తెలంగాణలో ఖర్చుపెట్టామని ఆయన చెప్పారు.

గవర్నర్లబదిలీలు రాజ్యాంగబద్దంగానేజరుగుతున్నాయని ఆయనఅభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలోతాము రెండవ రాష్ట్రాల పునర్విభజనకమీషన్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లుఆయన తెలిపారు. ఎన్నికలసమయంలో కేశవరావు పార్టీనాయకత్వాన్ని విమర్శించిన విషయాన్నిగుర్తు చేయగా కేశవరావు నోటికితాళం వేయడానికే పిసిసి పీఠంఅప్పగించామని ఆయన ఛలోక్తివిసిరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X