వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌హింసకు దిగితే సహించం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లు హింసకు పాల్పడితేసహించబోమని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి స్పష్టంచేశారు. నక్సలైట్లు గానీ నక్సలైట్లపేర ఇతరులు గానీ మరెవరైనా గానీచట్టవ్యతిరేక చర్యలకు దిగితేసహించబోమని ఆయన చెప్పారు.గురువారం జరిగిన కలెక్టర్లసమావేశంలో ఆయన చాలా విషయాలపైకుండబద్దలు కొట్టినట్లుమాట్లాడారు.

రాజకీయప్రక్రియను తమకు వదిలేయాలనిఆయన కలెక్టర్లకు సూచించారు.నక్సల్స్‌తో చర్చల ప్రక్రియను,రాజకీయ ప్రక్రియను తమకువదిలేసి చట్ట వ్యతిరేకకార్యకలాపాలను అరికట్టడంలో,చట్టవ్యతిరేక కార్యకలాపాలకుపాల్పడేవారిపై చర్యలు తీసుకోవడంలోకఠినంగా వ్యవహరించాలని ఆయనసూచించారు. ప్రజా ప్రయోజనాలకు అధికారులుతీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వంఅండదండలుంటాయని ఆయన చెప్పారు.పనులు చేసేవారే పొరపాట్లు చేస్తారని,పొరపాట్లు జరుగుతాయని పనులుచేయడం ఆపవద్దని, కాయలున్నచెట్లకు రాళ్లు తగులుతాయని ఆయనఅన్నారు. అందువల్ల మీడియా, ప్రతిపక్షాలవిమర్శలను, వైఖరులనుపట్టించుకోకుండా సాగునీటి ప్రాజెక్టులనిర్మాణానికి కృతనిశ్చయంతో పనిచేయాలని ఆయన అన్నారు.నక్సల్స్‌తోరెండో దఫా చర్చలు జరపాలనేదేప్రభుత్వ ఉద్దేశ్యమని, అయితే ఈప్రక్రియతో సంబంధం లేకుండాచట్టవ్యతిరేకంగా, రాజ్యాంగవ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినావారిపై అధికారులు చర్యలు తీసుకోవాలనిఆయన అన్నారు. శాంతి భద్రతలనుకాపాడాల్సిన బాధ్యత మీదేనని ఆయనజిల్లా కలెక్టర్లతో అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X