వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చట్టాలనైనామార్చిప్రాజెక్టులు కడతాం: కెకె
అనంతపురం:సాగు నీటి ప్రాజెక్టుకు ఎదురయ్యే ఏఅడ్డంకులనైనా తొలగిస్తామని ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడుడాక్టర్ కె. కేశవరావు ప్రజలకు హామీఇచ్చారు. ఆయన శుక్రవారంఅనంతపురంలో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు.
అవసరమైతేచట్టాలను, నిబంధనలను మార్చి అయినాసరే సాగు నీటి ప్రాజెక్టులను తమప్రభుత్వం నిర్మించి తీరుతుందని ఆయనచెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులకుతెలుగుదేశం, విపక్షాలు కల్పిస్తున్నఆటంకాలను అధిగమిస్తామని ఆయనచెప్పారు. చట్టాలు, నిబంధనలు ప్రజలకోసమే ఉన్నాయని, అవి ప్రజల సంక్షేమానికిఅడ్డు వచ్చినప్పుడు వాటిని మార్చకతప్పదని ఆయన అన్నారు.
ఈసభలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రిరఘువీరా రెడ్డి తెలుగుదేశం పార్టీపైతీవ్ర విమర్శలు చేశారు. విచక్షణతోవ్యవహరించాలని ఆయనతెలుగుదేశంపార్టీ నాయకులకుసూచించారు.
Comments
Story first published: Friday, December 3, 2004, 23:53 [IST]