భారతక్రికెటర్లను చంపుతామని బెదిరింపు
ఢాకా:బంగ్లాదేశ్ పర్యటనకు వస్తేచంపుతామని భారత క్రికెటర్లనుబంగ్లాదేశ్కు చెందిన ఒక ఇస్లామిక్గ్రూప్ బెదిరించింది. అయితే ఈ గ్రూప్పెద్దగా ఎవరికీ తెలియదు.బంగ్లాదేశ్ జట్టుతో మూడు వన్డేలు,రెండు టెస్టులు ఆడటానికి భారతక్రికెట్ జట్టు పర్యటన ఖాయమైనవిషయం తెలిసిందే.
చేతిరాతతో ఉన్న బెదిరింపు లేఖ ఫాక్స్ ప్రతితమకు అందిందని, హర్కత్ - ఉల్ -జిహాద్ అనే సంస్థ పేర ఈ లేఖ వచ్చిందనిభారత డిప్యూటీ హైకమీషనర్ ఎస్.చక్రవర్తి పిటి ఐ వార్తా సంస్థకుతెలియజేశారు. బంగ్లాదేశ్కుపర్యటనకు వస్తే భారతక్రికెటర్లను చంపుతామని ఆ సంస్థహెచ్చరించిందని ఆయన చెప్పారు.
ఈబెదిరింపు లేఖతో భారత జట్టు బంగ్లాదేశ్పర్యటనపై అనిశ్చితి ఏర్పడింది. ఈ హెచ్చరికనేపథ్యంలో బంగ్లాదేశ్ పర్యటనసురక్షితమా, కాదా బిసిసిఐ ఆలోచించినిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చక్రవర్తిచెప్పారు. ఈ విషయాన్ని తాము బంగ్లాదేశ్ప్రభుత్వానకి తెలియజేశామని,భారత జట్టు సభ్యులకు పూర్తి రక్షణకల్పిస్తామని హామీ ఇచ్చిందని ఆయనచెప్పారు.
సిరీస్విషయంలో తాము పూర్తి బాధ్యతతీసుకుంటామని, ఈ విధమైన లేఖలుతప్పుదారి పట్టిస్తాయని, ఇటువంటి లేఖలుసిరీస్ను దెబ్బ తీయకూడదనిబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి)అధ్యక్షుడు అ అజఘర్ అన్నారు. భద్రతాచర్యలను పెంచడానికి ప్రభుత్వంఅంగీకరించిందని ఆయన చెప్పారు. ఆ లేఖతమకు చేరలేదని బిసిసి ఐ వర్గాలుకోల్కత్తాలో ఆదివారం సాయంత్రంచెప్పాయి.