వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలస్యంగాఢాకాకు భారత క్రికెట్‌ జట్టు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా:బంగ్లాదేశ్‌ పర్యటనకు భారతక్రికెట్‌ జట్టు ఆలస్యంగా బయలుదేరుతుంది.నిర్ణీత కార్యక్రమం ప్రకారం భారతజట్టు ఈ నెల ఏడవ తేదీన ఇక్కడి నుంచిబయలుదేరి ఢాకాకు వెళ్లాల్సి ఉంది.

ఢాకాలోనిఒక తీవ్రవాద గ్రూప్‌ భారతక్రికెటర్లను చంపుతామని బెదిరించిననేపథ్యంలో కాస్తా ఆలస్యంగా ఢాకాకువెళ్తుంది. ఈ బెదిరింపు గురించి తమకుతెలియదని అంతకు ముందుకోల్‌కత్తాలోని బిసిసిఐ వర్గాలన్నాయి.భద్రతా చర్యలకు సంబంధించినఅంశాలను ప్రభుత్వం చూసుకుంటుందనికూడా ఆ వర్గాలన్నాయి.

ఈ హెచ్చరికనేపథ్యంలో బంగ్లాదేశ్‌ పర్యటనసురక్షితమా, కాదా బిసిసిఐ ఆలోచించినిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందనిఅంతకు ముందు భారత డిప్యూటీ హైకమీషనర్‌ చక్రవర్తి ఢాకాలో చెప్పారు. ఈ విషయాన్ని తాము బంగ్లాదేశ్‌ప్రభుత్వానికి తెలియజేశామని,భారత జట్టు సభ్యులకు పూర్తి రక్షణకల్పిస్తామని హామీ ఇచ్చిందని ఆయనచెప్పారు.

సిరీస్‌విషయంలో తాము పూర్తి బాధ్యతతీసుకుంటామని, ఈ విధమైన లేఖలుతప్పుదారి పట్టిస్తాయని, ఇటువంటి లేఖలుసిరీస్‌ను దెబ్బ తీయకూడదనిబంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బిసిబి)అధ్యక్షుడు అ అజఘర్‌ అన్నారు. భద్రతాచర్యలను పెంచడానికి ప్రభుత్వంఅంగీకరించిందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X