వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతకుమరిన్ని ఉపాధి అవకాశాలు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌:రాజీవ్‌ యువశక్తి పథకం ద్వారాయువతకు భవిష్యత్తులో మరిన్ని ఉపాధిఅవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచెప్పారు. ఆదివారంనాడు ఆయనమహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేటనియోజవర్గంలో రాజీవ్‌ పల్లెబాటకార్యక్రమాన్ని నిర్వహించారు.

మహబూబ్‌నగర్‌జిల్లాలోని పెండింగ్‌ నీటి పారుదలప్రాజెక్టులను అన్నింటినీ పూర్తి చేస్తామనిఆయన హామీ ఇచ్చారు. ఆహార భద్రతాకార్యక్రమం ద్వారా వలసలనునివారిస్తామని ఆయన చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోమాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(యంఆర్‌పియస్‌) కార్యకర్తలు ఎస్‌సిరిజర్వేసన్ల వర్గీకరణకు చర్యలుతీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారిడిమాండ్‌కు ప్రతిస్పందిస్తూ అన్నివర్గాలవారికీ న్యాయం చేస్తామని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X