వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆహారపథకం కంటితుడుపు చర్య:రావుల

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:జాతీయ ఆహార పథకం కిందికి వచ్చే జిల్లాలఎంపిక ప్రక్రియపై తెలుగుదేశంరాజ్యసభ సభ్యుడు రావులచంద్రశేఖర్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తివ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయనబుధవారం రాజ్యసభలోలేవనెత్తారు. జాతీయ ఆహార పథకాన్నిరాష్ట్రంలో కంటి తుడుపు చర్యగానేచేపడుతున్నారని ఆయన విలేకరులతోఅన్నారు.

రాష్ట్రంలోనిఎనిమిది జిల్లాలను మాత్రమే పథకంఅమలుకు ఎంపిక చేశారని,తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈపథకం మొత్తం ఇరవై మూడుజిల్లాల్లో అమలైందని ఆయన చెప్పారు.కరవు పరిస్థితులు నెలకొని ఆకలి చావులుసంభవిస్తున్న మెదక్‌, కరీంనగర్‌,శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి జిల్లాలను ఈపథకం అమలుకు ఎంపికచేయకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.మెదక్‌ జిల్లాలో నలబై మందికి పైగాఆకలి చావులకు గురయ్యారని ఆయనచెప్పారు. సంబంధిత మంత్రి ప్రక్రియప్రకారమే చేశారని అంటున్నారని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X