వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ:అనంత హత్యలపై వాగ్వివాదం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అనంతపురం జిల్లాలోని హత్యలపైశుక్రవారం శాసనసభలో అధికార,ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వివాదం చెలరేగింది. జీరో అవర్‌లోతెలుగుదేశం సభ్యుడు గోవిందప్పగురువారంనాడు అనంతపురం జిల్లాలోజరిగిన తమ పార్టీ కార్యకర్తవాసుదేవ రెడ్డి హత్య గురించిప్రస్తావించారు. ఈ సందర్భంలో ఇరు పక్షాలమధ్య వివాదం చెలరేగింది.

అనంతపురంజిల్లాలో హింసామార్గం వీడకపోతే తాముపోరు చేయక తప్పదని ప్రతిపక్షనాయకుడు నారా చంద్రబాబునాయుడుఅన్నారు. అనంతపురం జిల్లాలోని రాజకీయహత్యలపై సభలో ఎన్ని సార్లు ప్రస్తావించినప్రభుత్వం వాటిని అరికట్టడానికి సరైనచర్యలు తీసుకోలేదని ఆయనవిమర్శించారు. అంశాన్ని తెలుగుదేశం పార్టీలేవనెత్తిన తీరుపై స్పీకర్‌ కె. ఆర్‌.సురేష్‌ రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు.జీరోఅవర్‌లో ఎక్కువ సమయం తీసుకోవడంసరైంది కాదని స్పీకర్‌ చెప్పినాతెలుగుదేశం సభ్యులు వినలేదు.అనంతపురం జిల్లాలోని హత్యలపై తానుసభలో ప్రకటన చేస్తానని హోం మంత్రికె. జానారెడ్డి హామీ ఇచ్చారు. అనంతపురంజిల్లాలో హత్యలను నిరోధించడానికి కఠినచర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X