వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాదిగల ర్యాలీఉద్రిక్తం, ర్యాలీకి బాబు మద్దతు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:షెడ్యూలు కులాల ఎబిసిడి వర్గీకరణకు చట్టబద్ధతకల్పించాలని కోరుతూ మాదిగరిజర్వేషన్‌ పోరాట సమితి (ఎంఆర్‌పిఎస్‌)సోమవారం నిర్వహించిన ఛలో అసెంబ్లీకార్యక్రమం రాష్ట్రంలోని వివిధప్రాంతాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది.హైదరాబాద్‌లో అసెంబ్లీ ఆవరణలోకిప్రవేశించడానికి ప్రయత్నించిన ఎమ్మార్పీఎస్‌కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

గత ప్రభుత్వహయాంలో తాము పోరాడి సాధించుకున్న ఎబిసిడివర్గీకరణ విషయంలో రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్య్వహరిస్తోందని,సుప్రీంకోర్టులోసరైన వాదనలు విన్పించలేదని ఎమ్మార్పీఎస్‌ ఆరోపించింది.చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని గతతెలుగుదేశం ప్రభుత్వం మాదిగలఓట్లను ఆక ర్షించడానికి వారు కోరినవిధంగా ఎస్‌ సి రిజర్వేషన్లను ఎబిసిడిగావర్గీకరించారు. దీనిని మాలలు వ్యతిరేకిస్తూవస్తున్నారు. గత ఎన్నికల్లో మాదిగలుతెలుగుదేశం పక్షం వహించగా మాలలు కాంగ్రెస్‌కుమద్దతుపలికారు. నేటి ఎమ్మార్పీఎస్‌ ర్యాలీకి చంద్రబాబునాయుడు మద్దతుపలికారు. సోమవారం హైదరాబాద్‌లోర్యాలీలో పాల్గొనడానికి వరంగల్‌నుంచివస్తున్న ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలనునగర శివారులోని నాగోల్‌లో, నల్గొండజిల్లా నుంచి వస్తున్న వారిని సూర్యాపేటలోనుపోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని ఎమ్మార్పీఎస్‌ప్రశాంతంగా జరుపుకుంటే తమకుఅభ్యంతరం లేదని హోంమంత్రిజానారెడ్డి అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X