వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరువుసాయంపైపవార్‌ను కలిసిన ఎంపీలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రాష్ట్రానికి కరువు సహాయం పెంచాలనికోరుతూ ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెప్‌పార్లమెంటు సభ్యులు కేంద్రవ్యవసాయ శాఖ మంత్రిశరద్‌పవార్‌ను కోరారు. వారుమంగళవారం శరద్‌పవార్‌నుకలిసి ఈ మేరకు విజ్ఞప్తిచేశారు.

శరద్‌పవార్‌నుకలిసినవారిలో కేంద్ర మంత్రులు దాసరినారాయణరావు, పనబాక లక్ష్మి,లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉప నాయకుడు జి.వెంకటస్వామి తదితరులు ఉన్నారు.రాష్ట్రానికి పన్నెండు వందల కోట్లరూపాయల ఆర్థిక సహాయం అందించాలని, పనికిఆహార పథకం కింద బియ్యం కోటానుపెంచాలని ఎంపీలు శరద్‌పవార్‌నుకోరారు.శరద్‌పవార్‌సానుకూలంగా ప్రతిస్పందించారని,బుధవారం సంబంధిత శాఖ అధికారులతోసమావేశం ఏర్పాటు చేసి తమ విజ్ఞప్తిపైనిర్ణయం తీసుకుంటామని చెప్పారని దాసరినారాయణ రావు మీడియా ప్రతినిధులతోచెప్పారు. గతంలో ఇచ్చిన సహాయంలోసగమైనా ఇవ్వాలని కేంద్ర మంత్రినికోరినట్లు వెంకటస్వామి చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X