వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకంప్రకారం నక్సల్స్‌పై దాడులు: వివి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పోలీసులు పథకం ప్రకారం నక్సల్స్‌పైదాడులు చేస్తున్నారని సిపిఐ (మావోయిస్టు)ప్రతినిధి వరవరరావు విమర్శించారు.కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో ఆరునెలలు పొడగించి చిత్తశుద్ధితో అమలుచేయాలని ఆయన మంగళవారంమీడియా ప్రతినిధుల సమావేశంలోప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాల్పులవిరమణ ఒప్పందం ఈ నెల పదహారతేదీన ముగుస్తుంది.

చర్చలపైచిత్తశుద్ధి లేకపోవడం వల్లనేనక్సల్స్‌పై పోలీసుల చేత దాడులుచేయిస్తూ ప్రభుత్వం రెండో దశచర్చలను ఎగవేసే ప్రయత్నంచేస్తోందని ఆయన అన్నారు. కాల్పులవిరమరణ ఒప్పందాన్ని పోలీసులేఉల్లంఘిస్తున్నారని, పక్కా సమాచారంతోగ్రేహౌండ్స్‌ దళాలు దాడులు చేస్తున్నాయని,గాలింపు చర్యలు జరుపుతున్నాయనిఆయన అన్నారు. కరీంనగర్‌, ఖమ్మం,మహబూబ్‌నగర్‌, వరంగల్‌ జిల్లాల్లోజరిగిన సంఘటనలు ఈ విషయాన్నిధృవీకరిస్తున్నాయని ఆయనచెప్పారు.సభలు,సమావేశాలను పోలీసులు అడ్డుకుంటున్నారని,సభలకు అప్రజాస్వామిక షరతులువిధిస్తున్నారని ఆయన విమర్శించారు.అమర వీరుల వృద్ధతల్లిదండ్రులను కూడా పోలీసులువేధిస్తున్నారని ఆయనవిమర్శించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X