వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకటేష్‌అవయవాల మార్పిడికి హైకోర్టు నో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నతన కొడుకు అవయవాల మార్పిడికిఅనుమతించాలని వెంకటేష్‌ తల్లిపెట్టుకున్న పిటిషన్‌ను రాష్ట్రహైకోర్టు తిరస్కరించింది. వెంకటేష్‌నయం కాని మస్క్యులర్‌ డిస్ట్రోఫీవ్యాధితో బాధపడుతున్నాడు. దీంతోబతికి ఉండగానే తన కొడుకుఅవయవాల మార్పిడికి అనుమతివ్వాలంటూఅతని తల్లి సుజాత హైకోర్టులో పిటిషన్‌దాఖలు చేసింది.

బతికివున్న వ్యక్తి అవయవాల మార్పిడికి వీలుకల్పించే చట్టం భారతదేశంలో లేదని,అందువల్లత తన కొడుకుఅవయవాలను తీసి ఇతరులకు దానంచేయడానికి అనుమతించాలని చేసిన తల్లివిజ్ఞప్తిని అంగీకరించలేమని ఛీఫ్‌ జస్టిస్‌దేవేందర్‌ గుప్తా, ఎం. నారాయణరెడ్డిలతో కూడిన హైకోర్టు బెంచీస్పష్టం చేసింది. బ్రెయిన్‌ డెడ్‌ రోగిఅవయవాల మార్పిడికి మాత్రమే చట్టంఅనుమతిస్తుందని కోర్టు స్పష్టంచేసింది.బ్రెయిన్‌డెడ్‌ కాని రోగి అవయవాలను సమీపబంధువులకు దానం చేయడంకుదరదని వైద్య బృందం ఇచ్చినసూచనల మేరకు సుజాత విజ్ఞప్తినిఇదివరకే డివిజన్‌ బెంచీ తోసిపుచ్చింది. దీంతోఆమె హైకోర్టుకు అప్పీల్‌ చేసుకుంది.అయితే తాను సుప్రీంకోర్టుకు వెళ్తాననిసుజాత అంటోంది.జన్యుసంబంధమైన మస్క్యులర్‌డిస్ట్రోఫీతో బాధపడుతున్నవెంకటేష్‌ తన అవయవాలను దానంచేయాలని కోరుకున్నాడు. ఈ వ్యాధికిమందు లేకపోవడంతో ఇలాబాధపడడం కన్నా తన అవయవాలుఎవరికైనా ఉపయోడడం మంచిదనేతపన అది. అయితే కొడుకు కోరికనుమన్నించడానికి సుజాత తనప్రయత్నాలు మొదలు పెట్టింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X