వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడ్డంకులెన్నిఉన్నా ప్రాజెక్టుల పూర్తి: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలుకల్పించినా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంపూర్తి చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.సాగునీటి ప్రాజెక్టుల టెండర్లపైశాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చకుఆయన బుధవారం సమాధానం ఇచ్చారు.గత తెలుగుదేశం పాలనపైవిమర్శలు చేయడానికి, ఆ పార్టీ నేత నారాచంద్రబాబునాయుడిని దుయ్యబట్టడానికిఆయన ఎక్కువ సమయంకేటాయించారు.

గతతెలుగుదేశం యాబై ఆరు వేల కోట్లరూపాయలు అప్పు తెచ్చి ఒక్క పైసా కూడాప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు చేయలేదనిఆయన విమర్శించారు. శంకుస్థాపనచేసిన ప్రతి ప్రాజెక్టును తాము పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. గోదావరిజలాలను మెదక్‌, రంగారెడ్డి,నిజామాబాద్‌ జిల్లాలకు అందిస్తామని ఆయనచెప్పారు.ప్రాజెక్టులకుఅప్పులు ఇవ్వడానికి ముందుకు వచ్చేవారినిచెడగొట్టేందుకు తెలుగుదేశం పార్టీప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.పదేళ్లలో పది లక్షల ఎకరాలకునీరందిస్తామని గత తెలుగుదేశంప్రభుత్వం చెప్పిందని, తాముఐదేళ్లలో అరవై అయిదు లక్షలఎకరాలకు నీరందిస్తామని ఆయనచెప్పారు.ప్రజలకుమేలు చేయలేకున్నా నష్టంచేయవద్దని, రాష్ట్ర ప్రజల మీద కక్షతీర్చుకోవద్దని ఆయన తెలుగుదేశంసభ్యులను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబుప్రతిపక్షంలో కాటన్‌ కూడా ప్రాజెక్టులునిర్మించలేరని ఆయన వ్యాఖ్యానించారు.సాగునీటిటెండర్లపై వివరణకు అడ్వొకేట్‌జనరల్‌ను సభకు రప్పించాలనితెలుగుదేశం చేసిన విజ్ఞప్తిని స్పీకర్‌కె. ఆర్‌. సురేష్‌ రెడ్డి తిరస్కరించారు.అంతకు ముందు చర్చకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యసమాధానం ఇచ్చారు. టెండర్లలలోఅవకతవకలు జరగలేదని అంటూసుదీర్ఘ ప్రసంగం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X