స్వామి కేసు :జయ ప్రభుత్వానికి సుప్రీం నోటీసు
న్యూఢిల్లీ:శంకరరామన్ హత్య కేసులో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిబెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టుశుక్రవారం తమిళనాడు ప్రభుత్వానికినోటీసు జారీ చేసింది. తన బెయిల్పిటిషన్ను మద్రాసు హైకోర్టుతిరస్కరించడంతో జయేంద్ర సరస్వతిసుప్రీంకోర్టుకు వెళ్లిన విషయంతెలిసిందే.
జయేంద్రసరస్వతికి మధ్యంతర బెయిల్ఇస్తూ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయడానికిచీఫ్ జస్టిస్ ఆర్.సి. లహోటి నేతృత్వంలోనిముగ్గురు న్యాయమూర్తులతో కూడినసుప్రీంకోర్టు బెంచ్ తిరస్కరించింది.జయేంద్ర బెయిల్ పిటిషన్పైవిచారణను కొనసాగించడానికి మొత్తంకేసు డైరీని జనవరి ఆరవ తేదీనసమర్పించాల్సిందిగా సుప్రీంకోర్టుతమిళనాడు పోలీసులను ఆదేశించింది.శంకరరామన్ మరణవాంగ్మూలాన్నికూడా సమర్పించాలని కోర్టు తమిళనాడుపోలీసులు ఆదేశించింది. ఆ మరణవాంగ్మూలాన్నిఎవరు నమోదు చేసుకున్నారనేదికూడా తెలియజేయాలని కోర్టుఆదేశించింది.