వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపైహైకమాండ్‌ నిర్ణయానికి సై

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలంగాణ విషయంలో తమ పార్టీఅధిష్ఠాన వర్గం నిర్ణయానికి కట్టుబడిఉంటామని కోస్తా కాంగ్రెస్‌ నాయకులు గాదెవెంకటరెడ్డి, మండలి బుద్ధప్రసాద్‌ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రండిమాండ్‌ విషయంలో పలు అంశాలపై వీరుఇద్దరూ చాలా కాలంగా అసంతృప్తివ్యక్తం చేస్తూ వివిధ రూపాల్లోబహిరంగ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.తెలంగాణ అంశంపై వీరు ఢిల్లీ వెళ్లేఆలోచనలో కూడా ఉన్నారు.

తాముసమైకాంధ్ర కోసం అధిష్ఠానంపై ఒత్తిడితేవడానికి ఢీల్లీ వెళ్లడం లేదని,తెలంగాణపై రకరకాల ప్రకటనలువెలువతుండడం వల్ల అయోమయంచోటు చేసుకుందని, అది మంచిది కాదనివిన్నవించడానికే వెళ్లున్నామని వారుఆదివారం విలేకరుల సమావేశంలోచెప్పారు. తెలంగాణ అంశంపైకంగారు పడాల్సిందేమీ లేదని, తమపార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడిఉంటామని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంఏర్పాటు చేయాలని తమ పార్టీ అధిష్ఠానంనిర్ణయం తీసుకుంటేవ్యతిరేకించలేం కదా అనివారన్నారు.ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సియల్‌పి)సభ్యులు మరో విలేకరులసమావేశంలో తీవ్ర దాడి చేశారు.చంద్రబాబుకు ప్రచారార్బాటంపైమాత్రమే ఆసక్తి ఉంది తప్ప ప్రజాసమస్యల పరిష్కారం లేదనికిరణ్‌కుమార్‌ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు తదితరులువ్యాఖ్యానించారు. తన హయాంలో అవినీతి పెంచిపోషించిన చంద్రబాబుకు సాగునీటిప్రాజెక్టుల టెండర్ల ఖరారులోఅక్రమాలపై మాట్లాడే అర్హత లేదనివారన్నారు. చంద్రబాబు నియోజకవర్గంకుప్పం ప్రజలపై తమకు ఏ విధమైనకక్ష ధోరణి లేదని, ఇజ్రాయెల్‌కన్సల్టెసీ పేర తన దగ్గరిబంధువులకు చంద్రబాబు డబ్బులుకట్టబెట్టే పని చేశారని, దానిపైప్రభుత్వం విచారణకు ఆదేశించిందనివారన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X