వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధాలపైచర్చలకు సిద్ధమే: వరవరరావు

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌:ఆయుధాలపై చర్చించేందుకు నక్సలైట్లుసిద్దంగా ఉన్నారని సిపిఐ (మావోయిస్టు)ప్రతినిధి వరవరరావు చెప్పారు.రెండో విడత చర్చలు ఆయుధాలవిసర్జనపై జరుగుతుందనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చేసిన ప్రకటనకుప్రతిస్పందనగా ఆయన ఆదివారం ఆవిషయం చెప్పారు.

కాల్పులవిరమణపై హోం మంత్రి కె. జానారెడ్డిమాట మారుస్తున్నారని ఆయనవిమర్శించారు. కాల్పుల విరమణ జానారెడ్డిసంతకం పెట్టిన రెండు లేఖలుతమ వద్ద ఉన్నాయని ఆయనచెప్పారు. సాయుధ పోరాటంలో ఉన్నవారినిఆయుధాలు వదిలిపెట్టాలని అనడంఅవివేకమని ఆయన అన్నారు. కాల్పులవిరమణను మరో మూడు నెలలుపొడిగించాలని, నక్సలైట్ల కోసం గాలింపుచర్యలు నిలిపేయాలని వరవరరావుప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చర్చలవిషయంలో రాష్ట్ర ప్రభుత్వంద్వంద్వనీతిని ప్రదర్శిస్తోందని ఆయనవిమర్శించారు. రెండో విడత చర్చల్లోకేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుపాల్గొంటారా లేదా అనేది తమకు ముఖ్యంకాదని, మధ్యవర్తులు మాత్రంఉండాలని ఆయన అన్నారు. నక్సలైట్లతో చేసుకున్నకాల్పుల విరమణ గడువు ఈ నెలపదహారవ తేదీన ముగిసింది. అయితేప్రభుత్వం తిరిగి కాల్పుల విరమణనుపొడిగించలేదు. నక్సలైట్లతో చర్చలుజరుగుతున్న సమయంలోనే కాల్పులవిరమణ అమలులో ఉంటుందని జానారెడ్డిచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X