వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులు కోట్లుసంపాదిస్తున్నారు: ఎమ్మెస్సార్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌:నక్సలైట్లను అడ్డం పెట్టుకొని పోలీసులుడబ్బులు సంపాదిస్తున్నారని దేవాదాయ శాఖమంత్రి ఎం. సత్యనారాయణ రావుఆరోపించారు. సబ్‌ ఇన్‌స్పెకర్‌ ( ఎస్‌ ఐ)స్థాయి అధికారి కోట్లాది రూపాయలుసంపాదించిన ఉదంతాలున్నాయని ఆయనసోమవారం మీడియా ప్రతినిధులతోఅన్నారు.

తమఆదాయం పోతుందనే భయంతోనేకొందరు పోలీసు అధికారులునక్సలైట్లతో చర్చలనువ్యతిరేకిస్తున్నారని,కొంతమందేనని ఆయన అన్నారు. ఈవిషయాలు అందరికీ తెలిసినవేనని,అయితే ఎవరూ ఈ విషయాల గురించిబహిరంగంగా మాట్లాడటం లేదని,తాను మాట్లాడుతున్నానని ఆయనఅన్నారు. ఎవరికి తెలియదు చెప్పండనిఆయన మీడియా ప్రతినిధులనుఅడిగారు.నిషేధంఎత్తేసిన తర్వాత నక్సల్స్‌చందాలు వసూలు చేస్తున్నారని అంటున్నారనిఆయన గుర్తు చేస్తూ "నిషేధంఉన్నప్పుడు వసూలు చేయలేదా,నక్సల్స్‌కు డబ్బులు ఇవ్వంది ఎవరు?లాయర్లు, రాజకీయ నాయకులు,కాంట్రాక్టర్లు అందరూ ఇచ్చారు అని ఆయనఅన్నారు. నక్సలైట్లు రిక్రూట్‌మెంట్‌పెంచుకుంటున్నారనే మాటను ప్రస్తావిస్తూరిక్రూట్‌మెంట్‌ పెంచుకుంటే తప్పేమిటని,అన్ని పార్టీలు పెంచుకోవడానికేప్రయత్నిస్తాయని, అయితే నక్సల్స్‌నుజనజీవన స్రవంతిలోకి రావాలని తాముఅడుగుతున్నామని ఆయన అన్నారు.నక్సల్స్‌ సిద్ధాంతాలతో తానుఏకీభవిస్తున్నానని, వారి ఆశయాల విషయంలోముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి కూడాఅంగీకరిస్తున్నారని, అయితే నక్సల్స్‌జనజీవన స్రవంతిలోకి రావాలనేదేతమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X