తెలంగాణప్రజల సొత్తు: శ్రీనివాస్
హైదరాబాద్:తెలంగాణ ప్రజల సొత్తు అని ప్రదేశ్కాంగ్రెస్ కమిటీ (పిసిసి) మాజీఅధ్యక్షుడు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిడి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఎవరిసొత్తు కాదని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డి చేసినప్రకటనను మీడియా ప్రతినిధులుమంగవారం ప్రస్తావించినప్పుడు ఆయనఆ విధంగా అన్నారు.
తెలంగాణపైతమ పార్టీ నాయకురాలు సోనియా గాంధీనిర్ణయం తీసుకుంటారని, ఈ స్థితిలోతెలంగాణపై వివాదాల్లోకి వెళ్లడంమంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణఅనేది సమస్య అని, ఆ సమస్య తమ పార్టీఅధిష్ఠానం వద్ద ఉన్నదని, దానిపై సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని ఆయనఅన్నారు. తాము సోనియా నిర్ణయానికికట్టుబడి ఉంటామని, తెలంగాణ రాష్ట్ర సమితినేత కె. చంద్రశేఖర్ రావు కూడాసోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామనిచెప్పారని, ఈ స్థితిలో తెలంగాణ అంశాన్నిసంక్లిష్టం చేయడం సరి కాదని ఆయనఅన్నారు. ఎవరేమన్నా తుదకుసోనియా నిర్ణయానికి కట్టుబడిఉండాల్సిందేనని ఆయన అన్నారు.