మాల, మాదిగరిజర్వేషన్ల వర్గీకరణ గొడవ
హైదరాబాద్:షెడ్యూల్ కులాల రిజర్వేషన్లపై కాంగ్రెస్ప్రభుత్వం తమకంటే తమకువ్యతిరేకంగా పనిచేస్తోందని ఒక వైపుమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పియస్), మరో వైపు మాలమహానాడు విమర్శిస్తున్నాయి. ఎస్సిరిజర్వేషన్ల వర్గీకరణకు రాజ్యాంగసవరణ చేయాలని ఎంఆర్పియస్డిమాండ్ చేస్తుండగా కూడదని మాలమహానాడు అంటోంది.
ఎస్సిరిజర్వేషన్ల వర్గీకరణకు వెంటనేరాజ్యాంగ సవరణ తేవాలనిఎంఆర్పియస్ నాయకుడు మందకృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అంతిమంకాదని, పార్లమెంటు నిర్ణయమేఅంతిమమని ఆయన అన్నారు. ఉద్యోగాల్లోఎస్సి, ఎస్టిలకు ప్రమోషన్లు కూడదనిసుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, దాంతోరాజ్యాంగ సవరణ చేసి ఎస్సి,ఎస్టిలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లుకల్పించారని, అదే విధంగా ఎస్సిరిజర్వేషన్ల వర్గీకరణకుపార్లమెంటులో చట్టం తేవడంఅవసరమని ఆయన అన్నారు.
ఎస్సిరిజర్వేషన్ల వర్గీకరణకు చట్టంతేవడం పెద్ద ప్రక్రియ అని, ఏ రాష్ట్రంకూడా వర్గీకరణను ఆమోదించడంలేదని, అందువల్ల అది సాధ్యమయ్యే పనికాదని మాల మహానాడు నాయకుడు పి.వి.రావు అన్నారు. కమ్యూనిటీకామన్పూల్గా అనుభవించడానికి ఎస్సిరిజర్వేషన్లు కల్పించారని, కులప్రాతిపదికపై వాటిని కల్పించలేదని,అందువల్ల ఎస్సి రిజర్వేషన్లనువర్గీకరించాలనడం స్వార్థం,మూర్ఖత్వమని ఆయన అన్నారు.