పెనుఉప్పెనకు తమిళనాడులో
చెన్నైనగరంలో నూటా ఇరవై అయిదు మందిమరణించగా, కోస్తా తీరంలోని జిల్లానాగపట్టణంలో నాలుగు వందల మంది దాకామరణించినట్లు సమాచారం. కడలూరుజిల్లాలో నూటా ఎనబై మంది,కన్నియకుమారి జిల్లాలో నూటా యాబైమంది మరణించినట్లు తెలుస్తోంది. తిరువొట్టియూర్,ఎన్నోర్, రోయపురం వంటి చెన్నైఉత్తర ప్రాంతాల్లో మరణాలు ఎక్కువగాసంభవించాయి. బసంత్నగర్ వంటిదక్షిణ ప్రాంతాల్లో దాని ప్రభావంకనిపించిందని పోలీసులు చెబుతున్నారు.
తీరప్రాంతంలోనికుడ్డలోర్ జిల్లాలోనే నలబై రెండుమంది మరణించారు. నాగపట్టిణంలోఐదుగురు, కాంచీపురంలో ఐదుగురుమరణించినట్లు పోలీసులు తెలిపారు.
భూకంపనాలతో,ఉప్పెనతో భయకంపితులైనచెన్నై నగర ప్రజలు దాని నుంచిబయటపడలేకపోతున్నారు. సహాయపునరావాస కార్యక్రమాలుముమ్మరంగా సాగుతున్నాయి. ఉప్పెనవల్ల సముద్రం నీరు చెన్నై రోడ్లమీదికి వచ్చాయి. ఈ ప్రవాహం తాకిడివాహనాలు కొట్టుకుపోయాయి.
సైనిక,నావికా దళాలు, కోస్ట్ గార్డ్లతో పాటు రాష్ట్రప్రభుత్వ యంత్రాంగమంతా సహాయచర్యలకు దిగినట్లు ముఖ్యమంత్రిజయలలిత చెప్పారు. చెన్నై నగరపాలక సంస్థ అధికారులు రెండు లక్షలఆహారం పొట్లాలు పంచి పెట్టారు. బాధితులనువిద్యాసంస్థలకు తరలించారు. పూర్తి సహాయంఅందజేయడానికి సైనికులను, కోస్ట్గార్డ్లను అప్రమత్తం చేసినట్లుప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తెలిపారు.