వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధికారులను బాబుబెదిరించడం తగదు: రోశయ్య
హైదరాబాద్:చంద్రబాబు నాయుడు ప్రకృతివైపరీత్యాన్ని కూడా రాజకీయం చేయాలని చూడడందురదృష్టకరమని ఆర్ధిక మంత్రి రోశయ్య సోమవారం ఇక్కడవ్యాఖ్యానించారు.
చంద్ర బాబునాయుడుఉప్పెన బాధిత తీర ప్రాంతాల్లోపర్యటిస్తూ అధికారులను బెదిరిస్తున్నారని రోశయ్య ఆరోపించారు.దీనివల్ల అధికారులో ఆత్మ స్ధయిర్యందెబ్బతిని పనులకు అంతరాయం కలుగుతుందని ఆయన అన్నారు. దాదాపుపదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పని చేసినచంద్రబాబు నాయుడికి ఈ విషయంతెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఇలాఉండగా ఉప్పెన బాధితులకు రాష్ట్ర మంత్రులు పదివేలు, కాంగ్రెస్ఎమ్మెల్యేలు ఐదు వేల చొప్పున విరాళంప్రకటించారు.
Comments
Story first published: Monday, December 27, 2004, 23:53 [IST]