తెలంగాణసాధనకు సదస్సు దీక్ష
హైదరాబాద్:నిర్ణీత గడువులోగా కేంద్ర ప్రభుత్వంతెలంగాణ ఏర్పాటు చేయకపోతే ప్రజాఉద్యమం చేపట్టాలని తెలంగాణ రాష్ట్రనిర్మాణవాదుల సదస్సు నిర్ణయించింది.తెలంగాణ ఉద్యమంలో స్తబ్దతనెలకొన్న ప్రస్తుత తరుణంలోతెలంగాణ ఉద్యమాన్ని ముందుకునడిపించే ఉద్దేశంతో సోమవారం ఈసదస్సు జరిగింది.
తెలంగాణరాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికిఒక గడువు ఇవ్వాలని, ఆ గడువులోగారాష్ట్రం ఏర్పాటు చేయకపోతే ఉద్యమాన్నితీవ్రతరం చేయాలని సదస్సునిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంఏర్పాటయ్యే వరకు ఏ పదవులూతీసుకోబోమని సదస్సులో పాల్గొన్నవారుప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్నిసాధించే వరకు తమ ఉద్యమంకొనసాగుతుందని వారు చెప్పారు.
తెలంగాణఉద్యమనేత కొండా లక్ష్మణ బాపూజీకన్వీనర్గా ఈ సదస్సు డిసెంబర్పందొమ్మిదవ తేదీన మొదటిసమావేశం జరిగింది. కులసంఘాలను,విద్యార్థి సంఘాలను తెలంగాణ రాష్ట్రఏర్పాటులో భాగం చేయాలని కూడా సదస్సునిర్ణయించింది. మాజీ పార్లమెంటు సభ్యులుఎం. నారాయణ రెడ్డి, గుత్తా మోహన్రెడ్డి, మాజీ మంత్రి మేచినేని కిషన్రావు, టిపియస్కు చెందిన భూపతికృష్ణమూర్తి, కోడూరు గాంధీ,మురళీధర్ దేశ్పాండేతదితరులు దీనిలో ప్రముఖ పాత్రపోషిస్తున్నారు.