సునామీమృతులు
చెన్నై:సునామీ మృతుల సంఖ్య గణనీయంగాపెరుగుతోంది. తాజా అంచనాల ప్రకారంపదిహేడు వేల మంది సునామీ తాకిడికిమృత్యువాత పడ్డారు. ఏడుదేశాలను సునామీ అతలాకుతలం చేసింది.భారత్లో మృతుల సంఖ్య ఐదు వేలకుచేరుకుంది. ఇంకా గాలింపుజరుగుతోంది.
భారత్లోతమిళనాడు సునామీ తాకిడికి పెద్దయెత్తున నష్టపోయింది.తమిళనాడులో రెండున్నర వేలమందికి పైగా మరణించినట్లు అంచనా.అండమాన్ దీవుల్లో మూడు వేల మందిదాకా మృత్యువాత పడ్డారు.పాండిచ్చేరిలో రెండు వందల ఎనబైమంది, కేరళలో నూటా ఇరవై మూడుమంది మరణించారు. థాయ్లాండ్లోఏడు వందల మంది మరణించినట్లుఅంచనా. అండమాన్ నికోబార్ దీవుల్లోసోమవారం కూడా భూమి కంపించింది.
కేంద్రహోం మంత్రి శివరాజ్ పాటిల్చెన్నైకి చేరుకొని పరిస్థితినిసమీక్షిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిజయలలితను కలుసుకున్నారు. భారతీయజనతా పార్టీ అధ్యక్షుడు ఎల్.కె. అద్వానీతమిళనాడులోని సునామీ తాకిడి ప్రాంతాల్లోపర్యటించారు.
సునామితాకిన ప్రాంతాల్లో గల్లంతయిన వారిసంఖ్య అంతు చిక్కడం లేదు. శ్రీలంకలోపరిస్థితి దారుణంగా ఉంది.