విజయేంద్రసరస్వతిని ప్రశ్నించిన పోలీసులు
కాంచీపురం:శంకరరామన్ హత్య కేసునుదర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందంపోలీసులు మంగళవారంనాడు కంచిమఠం చిన్న స్వామి విజయేంద్ర సరస్వతినిప్రశ్నించారు. ఈ కేసులో విజయేంద్రసరస్వతిని పోలీసులు ప్రశ్నించడం గతమూడు రోజుల్లో ఇది రెండవ సారి.
మంగళవారంనాడువిజయేంద్ర సరస్వతిని పోలీసులు మూడుగంటల పాటు ప్రశ్నించారు. విజయేంద్రసరస్వతి ఉదయం పదకొండు గంటలకుప్రత్యేక పోలీసు బృందంకార్యాలయంలోకి వెళ్లి మధ్యాహ్నంరెండు గంటలా ఐదు నిమిషాలకు బయటకువచ్చారు.
విజయేంద్రసరస్వతిని పోలీసులు మొదటిపారి ఈ నెలఇరవై ఆరవ తేదీన డబ్బై అయిదునిమిషాల పాటు ప్రశ్నించారు. విజయేంద్రసరస్వతి వాహనాన్ని కార్యాలయంఆవరణలోకి పోలీసులు మొదటఅనుమతించలేదు. అలాగే కర్రపాదుకలతో, తాను కూర్చునే స్టూల్తోవిజయేంద్రను లోనికి అనుమతించడానికికూడా పోలీసులు నిరాకరించారు. ఈసమయంలో పోలీసులకు, విజయేంద్రసరస్వతి అనుచరులకు మధ్య తీవ్రవాగ్వివాదం చెలరేగింది. ఆ తర్వాతన్యాయవాదులు వచ్చిన తర్వాత చెక్కపీఠను, పాదుకలను లోనికితెచ్చుకోవడానికి పోలీసులుఅనుమతించారు.
శంకరరామన్హత్య కేసులో కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టయిన విషయం తెలిసిందే.