వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయేంద్రసరస్వతిని ప్రశ్నించిన పోలీసులు

By Staff
|
Google Oneindia TeluguNews

కాంచీపురం:శంకరరామన్‌ హత్య కేసునుదర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందంపోలీసులు మంగళవారంనాడు కంచిమఠం చిన్న స్వామి విజయేంద్ర సరస్వతినిప్రశ్నించారు. ఈ కేసులో విజయేంద్రసరస్వతిని పోలీసులు ప్రశ్నించడం గతమూడు రోజుల్లో ఇది రెండవ సారి.

మంగళవారంనాడువిజయేంద్ర సరస్వతిని పోలీసులు మూడుగంటల పాటు ప్రశ్నించారు. విజయేంద్రసరస్వతి ఉదయం పదకొండు గంటలకుప్రత్యేక పోలీసు బృందంకార్యాలయంలోకి వెళ్లి మధ్యాహ్నంరెండు గంటలా ఐదు నిమిషాలకు బయటకువచ్చారు.

విజయేంద్రసరస్వతిని పోలీసులు మొదటిపారి ఈ నెలఇరవై ఆరవ తేదీన డబ్బై అయిదునిమిషాల పాటు ప్రశ్నించారు. విజయేంద్రసరస్వతి వాహనాన్ని కార్యాలయంఆవరణలోకి పోలీసులు మొదటఅనుమతించలేదు. అలాగే కర్రపాదుకలతో, తాను కూర్చునే స్టూల్‌తోవిజయేంద్రను లోనికి అనుమతించడానికికూడా పోలీసులు నిరాకరించారు. ఈసమయంలో పోలీసులకు, విజయేంద్రసరస్వతి అనుచరులకు మధ్య తీవ్రవాగ్వివాదం చెలరేగింది. ఆ తర్వాతన్యాయవాదులు వచ్చిన తర్వాత చెక్కపీఠను, పాదుకలను లోనికితెచ్చుకోవడానికి పోలీసులుఅనుమతించారు.

శంకరరామన్‌హత్య కేసులో కంచి కామకోటిపీఠాధిపతి జయేంద్ర సరస్వతిఅరెస్టయిన విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X