వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలవెసులుబాటు వల్ల పనులు చేశాం: డిజిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సల్స్‌తో ప్రభుత్వ చర్చల వల్లలభించిన వెసులుబాటుతో తమ సాధారణపనులపై దృష్టి పెట్టడానికి అవకాశంకలిగిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్‌జనరల్‌ (డిజిపి) ఎస్‌. ఆర్‌. సుకుమారచెప్పారు. నక్సల్స్‌తో చర్చల వల్లప్రశాంత వాతావరణం ఏర్పడిందని,దానితో తాము నేరాల అదుపు,పరిశోధనలపై దృష్టి పెట్టగలిగామనిఆయన అన్నారు. ఈ సంవత్సరంలో నేరపరిస్థితిపై, తాము సాధించిన విజయాలపైఆయన గురువారం మీడియాప్రతినిధులకు వివరించారు.

గణేష్‌ఉత్సవాలు, కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగానిర్వహించడంలో తాము విజయంసాధించామని ఆయన చెప్పారు.ప్రమాదాలకు అవకాశాలు గల నూటా తొంబైస్ట్రెచెస్‌ను గుర్తించినట్లు ఆయనతెలిపారు.రాష్ట్రడిజిపిగా ఆయన శుక్రవారం రిటైర్‌కాబోతున్నారు. కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోజన్మించిన సుకుమార ఆంధ్రప్రదేశ్‌డిజిపిగా పదహారు నెలల పాటు పనిచేశారు.తన రిటైర్మెంట్‌ కాలాన్ని ప్రశాంతంగాగడుపుతానని ఆయన ఒక ప్రైవేట్‌ టీవీఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.రాజకీయాల్లో చేరే ఉద్దేశం తనకులేదని ఆయన స్పష్టం చేశారు. డిజిపిపదవీ నిర్వహణ తనకు ఎంతోసంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు.హాస్యస్ఫోరకమైన పుస్తకం రాయాలనిఉందని ఆయన చెప్పారు.రాష్ట్రడిజిపి పదవిని సర్వజిత్‌ సేన్‌చేపట్టబోతున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X