వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచితవిద్యుత్‌ ఇచ్చి తీరుతాం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:వారం రోజుల్లో విద్యుత్‌ విధానాన్నిప్రకటిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. ఈవిధానం ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచిఅమలులోకి వస్తుందని ఆయనశుక్రవారం మీడియా ప్రతినిధులతోచెప్పారు.

రైతులకుఉచిత విద్యుత్‌ను అందించడంలో తాముఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేదిలేదని ఆయన స్పష్టం చేశారు.ప్రాజెక్టులున్న ప్రాంతాల్లో వాటి ద్వారానీరివ్వడం, అవి లేని చోట బోర్ల నుంచి, బావులనుంచి సాగునీరు తోడుకోవడానికి ఉచితవిద్యుత్‌ను ఇవ్వడం తమవిధానమని ఆయన స్పష్టం చేశారు.ఉచిత విద్యుత్‌ హామీలో తలెత్తిన చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుతామనిఆయన చెప్పారు.సునామీబాధితుల సహాయ, పునరావాస చర్యలకోసం మూడు వందల పదిహేను కోట్లరూపాయాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్నికోరినట్లు ఆయన తెలిపారు. పునరావాసచర్యలు వేగంగా అమలుజరుగుతున్నాయని ఆయన చెప్పారు.మత్స్యకారులకు బోట్లు, వలలు ఇస్తామని,సునామి తాకిడి ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీమరమ్మత్తులు చేపడుతామని, ఇళ్లునిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X