వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోస్టులపై వైఎస్కేఅధికారం, టిఆర్ఎస్కు సున్నా:కెకె
విశాఖపట్నం:నామినేటెడ్ పదవులపై ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డిదే తుది నిర్ణయమని పిసిసి అధ్యక్షుడుకె.కేశవరావు స్పష్టం చేశారు. విశాఖజిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొనడానికి గురువారం ఇక్కడికివచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టిఆర్ఎస్కునామినేటేడ్ పోస్టులు ఇచ్చేది లేదని ఆయన స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్కువారికున్న బలం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చామని ఆయన అన్నారు. కాంగ్రెస్అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసంకృషి చేసిన వారికి అడగకపోయినాపదవులు వస్తాయని ఆయన అన్నారు.వైఎస్ ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తోందని ఆయన కితాబుఇచ్చారు.
Comments
Story first published: Thursday, February 10, 2005, 23:53 [IST]