ఎమ్యెల్యేక్వార్టర్స్లో కాల్పులు: పోలీసు అదుపులోవ్యక్తి
హైదరాబాద్:హైదరాబాద్లోని జూబిలీహిల్స్లో గలఎమ్యెల్యే కాలనీలో హర్షవర్ధన్ రెడ్డిఅనే వ్యక్తి గాలిలోకి కాల్పులు జరపడంతోతుపాకి గుండు ఎదురుగా ఉన్నఇంటిలోకి దూసుకుపోయింది.హర్షవర్ధన్ రెడ్డిని పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనఆదివారం ఉదయం ఏడు గంటలకు జరిగింది.
కోతులనుచెదరగొట్టడానికి తాను కాల్పులు జరిపినట్లుహర్షవర్ధన్ రెడ్డి చెబుతున్నారు.కోతులు తమ ఇంట్లోకి ప్రవేశించి చిరాకుపెడుతున్నాయని, వాటిని పారదోలడానికితాను గాలిలోకి కాల్పులు జరిపానని అతనుఅంటున్నాడు.
హర్షవర్ధన్రెడ్డి కాల్పులు జరపడంతో తుపాకిరెండు వందల మీటర్ల దూరంలో ఉన్నప్రకాశ్ రెడ్డి అనే వ్యక్తి ఇంటిబెడ్రూమ్లోకి దూసుకెళ్లింది. ప్రకాశ్రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బెడ్ రూమ్తలుపులకు, కిటికీలకు తుపాకిగుండు తాకిన ఆనవాళ్లను గుర్తించి,తూటా వచ్చిన దిశను అంచనా వేసిహర్షవర్ధన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈసంఘనలో ఎవరూ గాయపడలేదు.కరీంనగర్కు చెందిన ప్రకాశ్ రెడ్డిహైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.హర్షవర్ధన్ రెడ్డి సివిల్కాంట్రాక్టర్.