వైయస్లక్ష్యంగా టిడిపి అసెంబ్లీ వ్యూహం
హైదరాబాద్:శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ తన వ్యూహాన్నిఖరారు చేసుకుంది. మొత్తం ముప్పయిఅయిదు అంశాలను సమావేశాల్లోలేవనెత్తడానికి తెలుగుదేశంవ్యూహాన్ని ఖరారు చేసుకుంది. ప్రజాసమస్యలపై, శాంతిభద్రతలసమస్యపై నేరుగా ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డినిలక్ష్యంగా చేసుకొని దాడికి దిగాలనేఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ వ్యూహాన్నిఖరారు చేసింది. రాష్ట్ర శాసనసభబడ్జెట్ సమావేశాలు సోమవారంప్రారంభమవుతున్నాయి.
ఈతడవైనా ప్రజాసమస్యలపైప్రతిస్పందించాలని ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని పార్టీ నిర్ణయించుకుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకివచ్చిన తర్వాత నలబై యేడు మందితమ పార్టీ కార్యకర్తల, నేతలహత్యలను ప్రధానంగాప్రస్తావించనున్నట్లు తెలుగుదేశంనాయకులు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలనుఅమలు చేయడంలో ప్రభుత్వంవిఫలమైందనే విషయాన్ని ప్రధానంగాప్రజలకు తెలిపే విధంగా ప్రస్తావిస్తామనివారు చెప్పారు. రైతులకు గిట్టుబాటుధర కల్పించడానికి కూడా ప్రభుత్వంశ్రద్ధ చూపడం లేదని వారన్నారు.సాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ఖరారులోసుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికిఅనుకూలం కాదనే విషయాన్ని ప్రజలకుతెలియచెప్పే ప్రయత్నం చేస్తామనివారన్నారు.