చేతలుమావి, మాటలు కాంగ్రెస్వి: బాబు
హైదరాబాద్:తాము చేసిన పనులను కాంగ్రెస్ప్రభుత్వం తనదిగా చెప్పుకుంటోందనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు విమర్శించారు.తమ పథకాలకు పేర్లు మార్చుకునికాంగ్రెస్ ప్రభుత్వం తనవిగాచెప్పుకుంటోంది తప్ప కొత్త పనులు ఏవీచేపట్టడం లేదని ఆయన అన్నారు.గవర్నర్ ప్రసంగంలోకొత్తదనమేదీ లేదని ఆయనసోమవారం విలేకరుల సమావేశంలోఅన్నారు.
తప్పుడువాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినకాంగ్రెస్ కొత్త పథకాలుచేపట్టలేకపోతోందని ఆయన అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో వినూత్నపథకాలు చేపట్టి దేశ,ప్రపంచస్థాయిలో రాష్ట్రానికి ఒక గుర్తింపుతెచ్చామని ఆయన చెప్పుకున్నారు.తమ ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధకార్యక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపద్నాలుగు విచారణ సంఘాలు వేసిందని,డబ్బులు వచ్చేవాటికి మాత్రం క్యాబినెట్కమిటీలు వేస్తున్నారని ఆయనఅన్నారు.
ముందునాళ్లలోఏం చేస్తామో గవర్నర్ ప్రసంగంలోచెప్పుకోలని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వంఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.గవర్నర్ ప్రసంగం ఉత్త డొల్ల అనిఆయన అన్నారు. హైదరాబాద్అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకుపరిస్థితులను చక్కబెట్టింది తామేనని,అలాగే గన్నవరం ఓడరేవు విషయంలోఅన్నీ చేసి పెట్టామని, తాము చేసిన పలుపనులను చూపెట్టి కాంగ్రెస్ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందనిఆయన అన్నారు.