పరిటాలహత్యపై బాబు శవరాజకీయం: జగన్
కడప:శాసనసభ్యుడు పరిటాల రవి హత్యకేసులో రాజకీయ లబ్ధి కోసమేతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు తననులక్ష్యంగా ఎంచుకున్నారని ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికుమారుడు వై.యస్. జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబు శవరాజకీయాలు చేస్తున్నారని ఆయనసోమవారం ఒక తెలుగు టీవీఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. చంద్రబాబుతనను లక్ష్యంగా ఎంచుకోవడానికి గలకారణం ఊహించడం సులభమేననిఆయన అన్నారు. పరిటాలహత్యానంతరం ఐదు వందలబస్సులను దగ్ధం చేయించి చంద్రబాబుప్రజల జీవనాన్ని ఛిన్నాభిన్నం చేశారని ఆయనవిమర్శించారు.
పరిటాలహత్యకు ఫ్యాక్షనిజమే కారణమే, ఈహత్యకు రాజకీయాలతో ఏ విధమైనసంబంధం లేదని ఆయన అన్నారు.పరిటాల హత్య కేసులో లొంగిపోయిననిందితులకు తెలుగుదేశం, బిజెపిలతోసంబంధం ఉందే తప్ప కాంగ్రెస్కుసంబంధం లేదని ఆయన అన్నారు.పరిటాల హత్య విషయంలో రాజకీయ లబ్ధికోసం అనవసరమైన రాద్ధాంతంచేస్తున్నారని ఆయన అన్నారు.
పరిటాలమూడు విడతలు శాసనసభ్యుడిగాఎన్నికయ్యాడని, ఎప్పుడు కూడా తనపైపరిటాల ఆరోపణలు చేయలేదని, తమతండ్రి ముఖ్యమంత్రి అయ్యాక,మంత్రులు జెసి దివాకర్ రెడ్డి మీద,రఘువీరా రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఆతర్వాత తనపై ఆరోపణలు చేశారనిఆయన చెప్పారు. ప్రభుత్వాన్నిఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసిసెక్యూరిటీని పెంచుకోవడానికే తనపైపరిటాల ఆరోపణలు చేశారని ఆయనఅన్నారు.
పరిటాలఆరోపణలు చేసిన తర్వాత తనకు ఏంచేయాలో తోచక తన నిర్దోషిత్వాన్నినిరూపించుకోవడానికి తాను పరువునష్టం దావా వేశానని అని ఆయన అంటూ నాస్థానంలో మీరున్నా అదే పని చేస్తారు అనివిలేకరులనుద్దేశించి అన్నారు.