నక్సల్స్:ఎదురుకాల్పులు, లొంగుబాట్లు, దాడి
హైదరాబాద్:మావోయిస్టు నక్సలైట్లకు, పోలీసులకుమధ్య వరంగల్ జిల్లా ములుగుమండలం ఒంటిగుడిసె తండా వద్దఅడవుల్లో సోమవారం ఎదురుకాల్పులుజరిగాయి. ఈ ఎదురుకాల్పుల నుంచినక్సలైట్లు తప్పించుకున్నారు.సంఘటనా స్థలం వద్ద ఒక తుపాకీని,మూడు కిట్ బ్యాగ్లను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే,ఖమ్మం జిల్లాకు చెందిన పదకొండు మందినక్సలైట్లు సోమవారంనాడువరంగల్ రేంజ్ డిఐజిబి.యల్. మీనా ముందు లొంగిపోయారు.వివిధ కారణాల వల్ల లొంగిపోయిన ఈనక్సలైట్లలో మహిళలు కూడా ఉన్నారు.లొంగిపోయినవారిలో వివిధ నక్సల్స్గ్రూప్లకు చెందినవారున్నారు.
ఆదిలాబాద్జిల్లా కాగజ్నగర్ - సిర్పూర్మావోయిస్టు దళ సభ్యుడు తిరుపతిసోమవారంనాడు ఆదిలాబాద్ జిల్లా అదనపుపోలీసు సూపరింటిండెంట్ సత్తార్ఖాన్ముందు లొంగిపోయాడు. అంజయ్యఎన్కౌంటర్లో మరణించిన తర్వాతపోలీసులకు లొంగిపోవడానికి తిరుపతినిశ్చయించుకున్నాడు.
కరీంనగర్జిల్లా చందుర్తి మండలాధ్యక్షుడు ఆదిశ్రీనివాస్పై నలుగురు సాయుధమావోయిస్టులు దాడి చేశారు. దాడి నుంచిశ్రీనివాస్ సెక్యూరిటీ గార్డులు తగినసమయంలో ప్రతిస్పందించడం వల్లబయటపడ్డారు.