వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండోపంటకు నీటిపై పరిశీలన: పొన్నాల
హైదరాబాద్:నాగార్జునసాగర్ ఎడమ కాలువ కిందిభూములకు నీరందించే విషయాన్నిపరిశీలిస్తామని భారీ నీటి పారుదల శాఖమంత్రి పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. హోంమంత్రి కె. జానారెడ్డి నేతృత్వంలోనల్లగొండ, ఖమ్మం జిల్లాల శాసనసభ్యులుసోమవారం మంత్రి లక్ష్మయ్యను కలిసిఎడమ గట్టు కాలువ కింది భూములకునీరివ్వాలని కోరారు.
నీటిలభ్యతను బట్టి రెండు రోజుల్లో నిర్ణయంతీసుకుంటామని పొన్నాల లక్ష్మయ్యచెప్పారు. పంటల పరిస్థితిని కూడాపరిశీలిస్తామని ఆయన చెప్పారు. మొదటిపంటకు నీరిస్తామని హామీ ఇచ్చామని, ఆ మేరకుపంటలను కాపాడడానికి చర్యలుతీసుకుంటామని ఆయన చెప్పారు. రెండోపంటకు కూడా నీరివ్వాలని కోరుతున్నారని, ఈవిషయాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, February 14, 2005, 23:53 [IST]