వెదురుఉత్పత్తులకు మార్కెట్ పెంచుతాం:సియం
హైదరాబాద్:గ్రామీణ ప్రాంతాల్లో వెదురు పరిశ్రమలునెలకొల్పుతామని, వెదురు ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.జీవనాధారంగా వెదురు అనే అంశంపైఅటవీశాఖ ఏర్పాటు చేసిన రెండు సదస్సునుఆయన ఆదివారం ప్రారంభించారు. గ్రామీణప్రాంతాల్లో జీవన ప్రమాణాలనుపెంచేందుకు చర్యలు తీసుకుంటామనిఆయన చెప్పారు.
వెదరుపరిశ్రమకు సాంకేతి పరిజ్ఞానాన్ని జోడిస్తేఆదాయం పెరుగుతుందని ఆయనచెప్పారు. వెదురును మరింతపెంచడానికి ప్రయత్నిస్తామని ఆయనచెప్పారు. వెదురు పెంచే చోట్లపరిశ్రమలను నెలకొల్పినవారిని ఆయనఅభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లోనియువతీయువకుల ఆదాయాన్ని పెంచాల్సినఅవసరం ఉన్నదని, అందుకు తాముగత తొమ్మిది నెలలుగా కృషి చేస్తోందని,ఈ కృషికి కేంద్ర ప్రభుత్వం,పారిశ్రామికవేత్తలు సహకరిస్తున్నట్లుఆయన చెప్పారు. పరిశ్రమలునెలకొల్పడానికి ముందుకు వచ్చే వారికిఅన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన హామీఇచ్చారు.