వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇంట్లో ఎంసిఎపరీక్షలు రాయిస్తున్న వ్యక్తి పరారీ
హైదరాబాద్:ఇంట్లోనే ఎంసి ఏ పరీక్షలు నిర్వహిస్తున్నఒక వ్యక్తి పరారయ్యాడు. ఉస్మానియావిశ్వవిద్యాలయం ఎంసి ఎ కోర్సు పరీక్షలనురాజ్కుమార్ అనే వ్యక్తి తన ఇంట్లోనిర్వహిస్తున్న విషయాన్ని ఒక ప్రైవేట్టీవీ ఛానల్ బయటపెట్టింది. దాంతో అతనిఇంటిపై అధికారుల దాడి జరిగింది. ఈ లోగానేఅతను పరారయ్యాడు.
రాజ్కుమార్అనే వ్యక్తి విశ్వవిద్యాలయం అధికారులతోకుమ్మక్కయి ప్రశ్నపత్రాలు తెచ్చి తనఇంట్లోనే సమాధానాలు రాయిస్తున్నాడు.ఇతని ఇల్లు హైదరాబాద్లోని నల్లకుంటలోఉంటుంది. దాడి చేసిన అధికారులుప్రశ్నాపత్రాలను, సమాధాన పత్రాలనుస్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పరీక్షలురాయిస్తున్న ఆ వ్యక్తి కూడా ఎంసి ఎ విద్యార్థికావడం విశేషం.
Comments
Story first published: Sunday, February 20, 2005, 23:53 [IST]