వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎదురుకాల్పుల్లోఇద్దరు నక్సల్స్ మృతి, ఇద్దరులొంగుబాటు
విశాఖపట్నం:ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లోని విశాఖపట్నం జిల్లాలోజరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్మరణించినట్లు సమాచారం. మరోఇద్దరు మావోయిస్టు నక్సలైట్లులొంగిపోయినట్లు తెలుస్తోంది. విశాఖపట్నంజిల్లాలోని సీలేరు సమీపంలోని మంగంపాడుఅటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టునక్సలైట్లకు మధ్య ఆదివారంసాయంత్రం ఎదురుకాల్పులు జరిగాయి.
విశాఖపట్నంజిల్లా కలిమెల పోలీసు స్టేషన్ పరిధిలోపోలీసులు కూంబింగ్ జరుపుతుండగామావోయిస్టు నక్సలైట్లుతారసపడినట్లు తెలుస్తోంది. ఈసమయంలో ఇరు పక్షాల మధ్యఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం.సంఘటనా స్థలం నుంచి పోలీసులు భారీగాఆయుధాలను స్వాధీనం చేసుకునట్లుతెలుస్తోంది.
ఇదిలావుంటేవిశాఖపట్నం జిల్లా బోడిగడ్డ వద్దమందుపాతర పేలి నలుగురు పోలీసులుగాయపడ్డారు. మావోయిస్టు నక్సలైట్లు ఈమందుపాతరను పేల్చినట్లుభావిస్తున్నారు.
Comments
Story first published: Sunday, February 20, 2005, 23:53 [IST]