వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిటాలహత్య కేసు: మరో నిందితుడి అరెస్టు
అనంతపురం:తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాలరవి హత్య కేసులో కేంద్ర దర్యాప్తుసంస్థ (సిబిఐ) అధికారులు మరొకరిని అరెస్టుచేశారు. పరిటాల హత్య కేసు నిందితులకుసమాచారం అందిస్తూ వసతులుసమకూర్చాడనే ఆరోపణపై జి.వి. రెడ్డిఅనే వ్యక్తిని అరెస్టు చేశారు. జి.వి. రెడ్డినిసిబిఐ అధికారులు సోమవారంఅనంతపురం ఫస్టు క్లాస్ జ్యుడిష్యల్మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. జి.వి.రెడ్డికి వచ్చే నెల 7వ తేదీ వరకుజ్యుడిష్యల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలుజారీ చేసింది.
సిబిఐఅధికారులు జి.వి. రెడ్డి భార్యనుప్రశ్నిస్తున్నారు. అనంతపురం ఆస్పత్రిలోనర్సుగా పని చేసే జి.వి. రెడ్డి భార్యపరిటాల హత్య సంఘటనలో గాయపడిననిందితుడు నారాయణ రెడ్డికిరామ్మోహన్ రెడ్డి ఇంట్లో చికిత్సచేసినట్లు అనుమానిస్తున్నారు.రామ్మోహన్ రెడ్డిని సిబిఐ అధికారులుఇప్పటికే అరెస్టు చేశారు.
Story first published: Monday, February 21, 2005, 23:53 [IST]