హస్తినలోఆత్మాభిమానం తాకట్టు: బిజెపి
హైదరాబాద్:కాంగ్రెస్ నాయకులు ఆత్మాభిమానాన్నిహస్తినలో తాకట్టు పెడుతున్నారనిభారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డివిమర్శించారు. గవర్నర్ ప్రసంగానికిధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగినచర్చలో ఆయన పాల్గొన్నారు.పదవులను కాపాడుకోవడానికి రాష్ట్రకాంగ్రెస్ నాయకులు తమఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినా తమకేమీఅభ్యంతరం లేదని, కానీ రాష్ట్ర ప్రజలసంక్షేమాన్ని విస్మరించకూడదని ఆయనఅన్నారు.
రాష్ట్రపథకాలకు రాష్ట్ర నాయకుల పేర్లేపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.టంగుటూరి ప్రకాశం పంతులు, అల్లూరిసీతారామారాజు, నీలం సంజీవరెడ్డి, రావినారాయణ రెడ్డి, పుచ్చలపల్లిసుందరయ్య, టంగుటూరి అంజయ్యలాంటివారిపేర్లు పెట్టాలని ఆయన సూచించారు. జాతీయసంక్షేమ పథకాలకు జాతీయ నాయకులపేర్లు పెట్టుకుంటే తమకుఅభ్యంతరం లేదని ఆయన అన్నారు.పలు పథకాలకు రాజీవ్ గాంధీ పేరుపెట్టడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.