చంద్రబాబుస్థాయికి తగింది కాదు: సియల్పి
హైదరాబాద్:ప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు రాష్ట్రప్రభుత్వంపై అర్థరహిత విమర్శలుచేస్తున్నారని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సియల్పి) విమర్శించింది. గవర్నర్ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేతీర్మానంపై చేసిన ప్రసంగంలోచంద్రబాబు ప్రభుత్వంపైనిరాధారణమైన ఆరోపణలు చేశారని, అదిచంద్రబాబు స్థాయికి తగింది కాదనిసియల్పి సభ్యులు గాలిముద్దుకృష్ణమ నాయుడు, గాదెవెంకటరెడ్డి, తదితరులు సోమవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
సాగునీటిటెండర్ల ఖరారు కేసులో సుప్రీంకోర్టురాష్ట్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చిందని,అయినా చంద్రబాబు ఏ విధమైన ఆధారాలుచూపకుండా ఆరోపణలు చేశారని, ఇదిసుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టడమేనని వారన్నారు.చంద్రబాబునాయుడు నిర్మాణాత్మకవిమర్శ చేయడంలో విఫలమయ్యారనివారన్నారు. ఆధారాలు చూపుతూ,ప్రభుత్వ ఉత్తర్వులను ఉటంకిస్తూప్రసంగించడం అసలైన పద్ధతి అని,అయితే చంద్రబాబు అవేమీ లేకుండానేగాలివాటంగా ఆరోపణలు చేశారనివారన్నారు.