రాష్ట్రంలోఐదు కొత్త యూత్ హాస్టళ్లు:సునీల్దత్
హైదరాబాద్:రాష్ట్రంలో నూతనంగా ఐదు యువజనహాస్టళ్లను ఏర్పాటు చేయనున్నట్లుకేంద్ర మంత్రి సునీల్దత్ తెలిపారు.తూర్పు గోదావరి, విజయనగరం,కడప, కరీంనగర్, మెదక్ జిల్లాలోవీటిని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.వివేకానంద స్వామి జయంతిసందర్భంగా యేటా జరిగేయువజనోత్సవాలను ఈసారిహైదరాబాద్లో నిర్వహించారు. ఈఉత్సవాలను సునీల్దత్ సోమవారంహాజరయ్యారు. ఈ ఉత్సవాలను రాష్ట్రగవర్నర్ సుశీల్కుమార్ షిండే జ్యోతిప్రజ్వలనం చేసి ప్రారంభించారు.
శాంతి,సద్భావన, అభివృద్ధి సాధన కోసం ఈయువజనోత్సవాలను నిర్వహిస్తున్నట్లుఆయన తెలిపారు. దేశంలోనియువతను ఏకం చేసేందుకు ఈఉత్సవాలు తోడ్పడతాయని ఆయనచెప్పారు. యువజనోత్సవాలకు అన్నిరాష్ట్రాల నుంచి యువతీయువకులుహాజరయ్యారు. వివిధ రాష్ట్రాలసాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు,ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర యువజనసర్వీసుల మంత్రి హరీష్రావు,తదితరులు ఈ ఉత్సవాలకుహాజరయ్యారు.