వైయస్తీరు హత్యలు చేసే ఆనందించేది: బాబు
హైదరాబాద్:ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి తీరు హత్యలు చేసిఆనందించే పద్దతిలో ఉన్నదనితెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.రాజకీయంగా అడ్డు వచ్చినవారిని హత్యలుచేసి అడ్డు తొలగించే విధానాన్ని వైయస్అవలంభిస్తున్నారని, ఇది రాజకీయాలకుమంచిది కాదని ఆయన అన్నారు.గురువారం శాసనసభ వాయిదాపడిన అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడారు.
అత్యంతతీవ్రమైన చర్చ శాసనసభలోజరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రినవ్వుతూ కూర్చుంటున్నారని, ఏంచేసుకుంటారో చేసుకోండనే పద్ధతిలోవ్యవహరిస్తున్నారని, ఇది దారుణమూబాధాకారమూ అని ఆయన అన్నారు. పరిటాలహత్య కేసులో ముఖ్యమంత్రికిప్రత్యక్ష సంబంధం ఉన్నదని ఆయనఅన్నారు. ముఖ్యమంత్రి హత్యలనుప్రోత్సహిస్తున్నారని ఆయనఆరోపించారు.
ప్రజాసమస్యలనుప్రభుత్వం పట్టించుకోవడం లేదని,తాము నిలదీస్తే సభకు అడ్డుతగులుతున్నారని అంటున్నారని,ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బయటపడాలనేపద్దతిలో ప్రభుత్వంవ్యవహరిస్తోందని, లేకుంటే ప్రజాసమస్యలు చర్చకు వస్తాయనిభయపడుతున్నారని ఆయన అన్నారు.పరిటా రవి హత్యపై సమగ్ర చర్చజరకుండా అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారని ఆయన అన్నారు. పరిటాల రవిహత్య కేసును ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆయనవిమర్శించారు.