మార్చి 10నరావాలని స్వాములకు కోర్టు ఆదేశం
కాంచీపురం/చెన్నై:శంకరరామన్ హత్య కేసులోనిందితులందరి రిమాండ్ను మార్చి 10వతేదీ వరకు పొడిగిస్తూ కాంచీపురంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది.కంచి స్వామి జయేంద్ర సరస్వతి, చిన్న స్వామివిజయేంద్ర సరస్వతి రిమాండ్ను మార్చి10వ తేదీ వరకు కోర్టు పొడిగించింది.కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ ప్రతులనుగురువారంనాడు కూడా కోర్టునిందితులకు అందజేయలేదు. మార్చిపదవ తేదీన కోర్టుకు హాజరు కావాలనికోర్టు ఇద్దరు స్వాములను ఆదేశించింది.
కంచిస్వాములతో పాటు 24 మంది నిందితులుగురువారంనాడు ఫస్టు క్లాస్జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్ జి. ఉత్తమరాజ్ముందు హాజరయ్యారు. మార్చి పదవతేదీన నిందితులకు చార్జిషీట్ ప్రతులుఇవ్వవచ్చునని భావిస్తున్నారు. వేలూరుజిల్లాలోని కాల్వాయి నుంచి జయేంద్రసరస్వతి కాంచీపురం వచ్చారు.విజయేంద్ర సరస్వతి చెన్నై నుంచివచ్చారు.
మాధవన్పైదాడి కేసులో కంచి కామకోటి పీఠాధిపతిజయేంద్ర సరస్వతికి సెషన్స్ కోర్టుముందస్తు బెయిల్ మంజూరు చేసింది.25 వేల రూపాయల పర్సనల్ బాండ్ను,అంతే మొత్తానికి రెండు సెక్యూరిటీలనుఇవ్వాలని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి పి.మురుగేషన్ జయేంద్ర సరస్వతినిఆదేశించారు. మార్చి 10వ తేదీన లేదాఅంతకు ముందు కాంచీపురుఫస్టుక్లాస్ జ్యుడిష్యల్ మెజిస్ట్రేట్కోర్టుకు హాజరు కావాలని కూడా మెజిస్ట్రేట్సూచించారు. ప్రతి మంగళవారంఉదయం పది మధ్యాహ్నం 12 గంటలమధ్య దర్యాప్తు అధికారి ముందుహాజరు కావాలని కూడా ఆయన కంచి స్వామినిఆదేశించారు.