యంపిఇవోలభర్తీపై అసెంబ్లీ నుంచి టిడిపి వాకౌట్
హైదరాబాద్:వ్యవసాయ విస్తరణాధికారులను(యంపిఇవోలను) తిరిగి తీసుకోవడానికిప్రభుత్వం అంగీకరించనందుకునిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులుగురువారం శాసనసభ నుంచి వాకౌట్చేశారు. యంపి ఇవలోను తిరిగి ఉద్యోగాల్లోకితీసుకుని కొనసాగించాలని తెలుగుదేశంసభ్యులు ప్రశ్నోత్తరాల సమయంలోప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం యంపిఇవోలుగా పని చేస్తున్నవారికి 15 శాతంవెయిటేజీ మార్కులు ఇస్తామని, త్వరలో 275ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయబోతున్నామనివ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డిచెప్పారు.
యంపిఇవోల విషయంలో ప్రభుత్వ వైఖరిని సిపి ఐ,సిపియంలు కూడా వ్యతిరేకించాయి. గతప్రభుత్వమే వ్యవసాధికారులపోస్టులను తగ్గించిందని మంత్రి చెప్పారు.దీంతో సభలో వాగ్వివాదం జరిగింది. యంపిఇవోలలో పది శాతం మినహా మిగతావారందరూ అర్హులైనవారేనని, వారినికొనసాగించడానికి అభ్యంతరం ఉండాల్సినఅవసరం లేదని తెలుగుదేశంతెలుగుదేశం సభ్యులు అన్నారు.